×

రూ.2 లక్షల రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సీఎం

రూ.2 లక్షల రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Spread the love

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ హమీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీపై కార్యచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా రైతురుణమాఫీపై నివేదిక అందించాలని సూచించారు.

ప్రధానాంశాలు:

  • రూ.2 లక్షల రైతు రుణమాఫీ
  • సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
  • కార్యచరణ ప్రారంభించాలని ఆదేశం

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. యూత పథకంలో భాగంగా.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం కోసం ఖర్చు పరిధిని రూ.10 లక్షలకు పెంచూతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో సీఎం రేవంత్ నిమగ్నమయ్యారు. అందులో భాగంగా.. రైతులకు రూ.2 లక్షల మేరకు రుణమాఫీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

కార్యచరణ ప్రారంభించాలని ఆదేశం :

సోమవారం సచివాలయంలో ఆయన రైతుభరోసాపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయశాఖ విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. రుణమాఫీపై అధికారుల నివేదిక అనంతరం ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రైతులకు యాసంగి సీజన్‌ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేల సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా తాము హామీ ఇచ్చామని, దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కానందువల్ల ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.

తెలంగాణలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద అయిదు, పది ఎకరాల్లోపు వారికి ఎంతెంత అందించారో స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. అన్నదాతలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా చెప్పారు. యాసంగి సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత నివారించాలని, పంటలకు సక్రమంగా సాగునీరు అందేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి రైతుబంధు నిధుల విడుదలను అధికారులు ప్రారంభించారు. 70 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల మేరకు చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెప్పారు.

DailySpark News ద్వారా ఎప్పటికప్పుడు న్యూస్ అప్‌డేట్స్, ఆసక్తికర కథనాలను పొందేందుకు

Dailyspark News Telegram channel ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

Also Read:

Rythu Bharosa: పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ మూడు విడతల్లో ఇస్తారా?

Post Comment