×

Rythu Bharosa: పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ మూడు విడతల్లో ఇస్తారా?

Rythu Bharosa: పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ మూడు విడతల్లో ఇస్తారా?

Spread the love

రబీ సీజన్‌లో రైతులకు పంటపెట్టబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా విదివిధానాలు ఖరారు కానుందున గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు మాదిరిగా ఎకరాకు రూ. 5 వేలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన రైతు భరోసా నిధులు ఎకరానికి ఏడాది రూ. 15 వేలు ఎన్ని విడతల్లో ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ డబ్బులు రూ. 5 వేల చొప్పున మూడు విడతల్లో ఇస్తారా? లేక రెండు విడతల్లో ఇస్తారా ? అనేది చర్చనీయాంశమైంది.

ప్రధానాంశాలు:

  • పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’
  • మూడు విడతల్లో ఇస్తారా?
  • ఆసక్తికరంగా ప్రభుత్వ నిర్ణయం

పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా‘ :

తెలంగాణలోని రైతులకు యాసంగి సీజన్‌ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేల సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే.. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కానందువల్ల ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం ఆదేశించారు. ఇవాళ్టి నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.

యాసంగి సీజన్ మెుదలైన నేపథ్యంలో రైతులకు త్వరగా సహాయం అందించాల్సిన అవసరం ఉన్నందున ఈ సీజన్‌లో రైతు బంధుతో ముందుకు సాగాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.7,500 కోట్ల జమ చేయనున్నారు. నిజానికి నవంబర్ చివరివారంలోనే పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో పడాల్సి ఉన్నా.. భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చివరి నిమిషంలో ఆగిపోయింది.

మూడు విడతల్లో ఇస్తారా? :

రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 15 వేల పంట పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కౌలు రైతులను కూడా గుర్తించి వారికి ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పింది. అయితే ఈ సాయాన్ని ప్రభుత్వం రెండు విడతల్లో రూ. 7,500 చొప్పున ఇస్తారా? (రబీ, ఖరీఫ్) లేక రూ. 5 వేల చొప్పున మూడు విడతల్లో ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి రైతుభరోసా విధివిధానాలు ఖరారు కాకపోవటంతో రైతుబంధు మాదిరిగానే రూ. 5 వేలు ఇస్తున్నారు. ఇదే విధంగా మరో రెండు విడతల్లో రూ. అయిదేసి వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఆయకట్టు పెరిగాక.. కొన్ని ప్రాంతాల్లో మూడు పంటలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటకు ముందు ఆ తర్వాత ఇలా ఏడాదిలో మూడు విడతల్లో రైతు భరోసా సాయం అందిచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కాటవం, సంక్షేమ పథకాల అమలుకు భారీగా బడ్జెట్ అవసరం అవుతుండటంతో మూడు విడతల్లో పంట సాయం ఇవ్వటం ద్వారా కొంతమేరైనా ఒత్తిడి తగ్గించుకోవాలి ప్రభుత్వం భావిస్తోందట. ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకున్న 70 లక్షల మంది రైతులకు మాత్రమే గత ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్ మాత్రం కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు కూడా సాయం అందిస్తామని చెప్పింది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను గుర్తించడానికి మార్గదర్శకాల ఖరారుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున, వారికి 2024 ఖరీఫ్ సీజన్ నుంచి రైతు భరోసా సాయం అందే అవకాశం ఉందని తెలిసింది.

ఆసక్తికరంగా ప్రభుత్వ నిర్ణయం :

ఇక కాంగ్రెస్ హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. ఈ అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకులతో చర్చలు జరిపి వ్యవసాయ రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రతి నెలా, ఐదేళ్లపాటు వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఐదేళ్లపాటు వడ్డీ రూపంలో నెలకు రూ.600 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎన్ని విడతల్లో వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Read More

Samsung Drone Camera Phone : Check out the features of the firhttps://dailysparknews.com/samsung-drone-camera-phone-check-out-features/st drone camera smartphone ever released by Samsung.

Post Comment